సుదర్శన్, సాత్విక జంటగా హేమల్ తుమ్మపూడి తెరకెక్కించనున్న చిత్రం ‘పాటకు ప్రాణం’. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ బుధవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. హీరో నిఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. అనంతరం దర్శకనిర్మాత హేమల్ తుమ్మపూడి మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో సంగీతానికి, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా ఇది.
శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’ అని చెప్పారు. ఒక పాతతరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ఈ తరం జెన్-Z సంగీతకారుడి మ్యూజికల్ జర్నీని ఇందులో చూపించబోతున్నారని నటుడు తనికెళ్ల భరణి చెప్పారు. హీరోహీరోయిన్స్ సుదర్శన్ వంగల, సాత్విక, నటీనటులు రాజీవ్ కనకాల, అనితా చౌదరి, నిర్మాత శ్రీరామ్ తుమ్మపూడి, డీఓపీ సంజీత్ సింగ్, ఎడిటర్ ప్రభాత్ రెడ్డి పాల్గొన్నారు.
